Social Icons

Pages

Tuesday, June 12, 2018

Competitive Exams Special - Ancient history

1. నదీ తీరమైదానాల్లో జనం స్థిరపడిన ప్రాంతాన్ని ఏ పదంతో పిలిచేవారు? - (జనపదం)

2. చరిత్రకారుల అంచనా ప్రకారం ప్రజలు ఎప్పటి నుంచి నదీ తీరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు? - (క్రీ. పూ. 2700)

3. జనపదం అనే మాటకు సరైన అర్థం?  -(గ్రామం (లేదా) పట్టణం)

4. "చరిత్ర పితామహుడు" అని ఎవరిని వ్యవహరిస్తారు? (హెరిడోటస్)

5. "ఢిల్లీ, అయోధ్య, కౌశాంబి" అనేవి? - (పురాతత్వ ప్రాంతాలు)

6. ప్రాచీన కాలంలో "గృహపతి" అంటే? - (భూమి యజమానులు)

7. ప్రాచీన కాలంలో "భర్తుకా" అనేవారు ఏ వర్గానికి చెందినవారు? - (పనివాళ్లు)

8. ప్రాచీన కాలంలో గ్రామ పెద్దగా వ్యవహరించడానికి అర్హత? - (భూమిని ఎక్కువ కలిగి ఉండటం)

9. ప్రాచీన కాలంలో  రాజులు గ్రహీపతుల నుంచి వసూలు చేసే పన్ను శాతం? - (1/6)

10. వృత్తి పనివారు రాజుకు పన్నును ఏ రూపంలో చెల్లించేవారు? - (సేవల రూపం)

11. అటవీ ఉత్పత్తులైన తోళ్లు, కలప వంటివి రాజుకు పన్నుగా చెల్లించే వర్గం ఏది? - (వేటగాళ్లు)

12. ఏ రాజు కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించింది? - (మహాపద్మనందుడు)

13. ప్రోడస జనపదాల్లో పేరు పొందిన గణ రాజ్యం ఏది? - (వజ్జి)

14. "గణ రాజ్యం" అంటే? - (అనేక మంది పాలకులుగా ఉండటం)

15. గణ రాజ్యాల విధాన రూపకల్పనలో ఎవరికి అవకాశం ఉండదు? - (మహిళలు, బానిసలు, సేవకులు)

16. గణ రాజ్యాలు భారత దేశ చరిత్రలో వర్థిల్లిన కాలం? - (1500 సంవత్సరాలు)

17. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? - (చంద్రగుప్తుడు)

18. మౌర్య చంద్రగుప్తుడు చారిత్రకంగా గుర్తింపు పొందడానికి కారణం? - (భారత ఉపఖండాన్ని పాలించిన తోలి చక్రవర్తి కావడం)

19. మౌర్యుల పాలనలో తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి అనేవి? - (రాష్ట్రాలు)

20. మౌర్యుల కాలంలో విదేశీ వస్తువులు అధికంగా లభించే ప్రాంతం ఏది? - (తక్షశిల)

21. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో ప్రధాన అంశాలు? - (రాజ్య స్థాపన - పాలన, వివిధ వృత్తుల వారి నుంచి పన్నుల వసూళ్లు, భారత ఉపఖండంలో లభించే వనరులు)

22. భారత దేశ చరిత్రలో శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన తొలి చక్రవర్తి?- (అశోకుడు)

23. అశోకుని శాసనాలు ఏ భాషలో రాశారు? - (ప్రాకృత భాష, బ్రహ్మలిపి)

24. అశోకుడు కళింగ యుద్ధం చేసిన సంవత్సరం? - (క్రీ. పూ. 261)

25. "కళింగ" ఏ రాష్ట్రానికి పాత పేరు? - (ఒడిషా)

26. భారత దేశ చరిత్రలోనే గాక, ప్రపంచ చరిత్రలో కూడా అశోకుడు స్థానం పొందడానికి కారణం? - (యుద్ధంలో విజయం సాధించినా, వాటికి స్వస్తి పలకడం)

27. అశోకుడు ధర్మ మహామాత్రులనే ఉద్యోగాల్లో నియమించడానికి కారణం?  -(ప్రజల మధ్య సామరస్య జీవనం కోసం)

28. భారత దేశ చరిత్రలో మనుష్యులకే గాక, జంతువులకు  కూడా వైద్య సదుపాయాలు కల్పించిన చక్రవర్తి? - (అశోకుడు)

29. దక్కన్ ప్రాంతం ఎక్కడ విస్తరించింది? - (గోదావరి - కృష్ణా నదుల మధ్య ప్రాంతం)

30. మౌర్యుల పతనానంతరం దక్షిణ భారతదేశాన్ని 200 ఏళ్లు పాలించింది? - (శాతవాహనులు)

31. శాతవాహనుల ఆంధ్ర దేశ రాజధాని? - (ధాన్య కటకం)

32. దక్షిణ భారత రాజవంశాలు ఏ దేశంతో వ్యాపారం చేసేవారు?  - (రోమ్)

33. శాతవాహనుల కాలం నాటి మ్యాకదోని శిలాశాసనం ఎక్కడ ఉంది? - (బళ్లారి)

34. శాతవాహన రాజుల్లో గొప్పవారు?  -(గౌతమీ పుత్ర శాతకర్ణి, వాశిష్ఠపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి,)

35. కృష్ణా నదీతీరంలో విజయపురిని రాజధానిగా చేసుకొని పాలించింది? - (ఇక్ష్వాకులు)

No comments:

Post a Comment