Social Icons

Pages

Tuesday, May 10, 2022

Telugu GK Bits - యూరోపియన్ల రాక

 Telugu GK Bits - యూరోపియన్ల రాక 

1. తురుష్కులు కాన్ సాంట్  నోఫిల్ భూమార్గాన్ని ఏ సంవత్సరంలో మూసివేశారు? 

జ. క్రీ.శ. 1453 

2. క్రీ.శ. 1498లో భారతదేశ పడమటి తీరాన్ని చేరిన మొదటి పోర్చుగీస్? 

జ. వాస్కోడిగామా 

3. భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన వారు? 

జ. పోర్చుగీస్ వారు

4. వాస్కోడిగామా చేరిన భారతీయ రాజ్యం కాలికట్ రాజు ఎవరు?

 జ. జామొరిన్ 

5. పోర్చుగీసు వారి తర్వాత భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు ? 

జ. డచ్ వారు 

6. భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు? 

జ. పోర్చుగీసువారు 

7. ఇండియాకు వచ్చిన చివరి యూరోపియన్లు ?

 జ. ఫ్రెంచ్ వారు 

8. ఫ్రెంచీ ఈస్టిండయా సంఘంను ఏ సంవత్సరంలో స్థాపించారు ? 

జ. క్రీ.శ. 1664లో 

9. భారతదేశంలో ఆధునిక యుగం ఎప్పుడు ప్రారంభమైంది? 

జ. 18వ శతాబ్దంలో 

10. 'క్రూసేడులు” అనే మత యుద్ధాలు ఎవరెవరికి మధ్య జరిగాయి ? 

జ. క్రైస్తవులకు, మహ్మదీయులకు 

11. భారతీయ స్త్రీలను వివాహం చేసుకొమ్మని పోర్చుగీస్ లను ప్రోత్సహించిన పోర్చుగీస్ గవర్నర్? 

జ. ఆల్బుకర్క్ 

12. యునైటెడ్ ఈస్టిండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండు ను  ఎప్పుడు డచ్ ప్రభుత్వం ఇండియాకు పంపింది? 

జ. క్రీ.శ. 1602

13. ఫ్రెంచి వలసలకు ప్రధాన కేంద్రం? 

జ. పాండిచ్చేరి 

14. సెయింట్ జార్జికోట ఎక్కడ ఉంది? 

జ. మద్రాస్ 1

15. ఆంగ్లేయులకు, ఫ్రెంచివారికి మధ్య సంఘర్షణలకు కేంద్రమైన పట్టణం? 

జ. ఆర్కాట్ పట్టణం (కర్ణాటక రాజ్య రాజధాని) 

16. మొదటి కర్ణాటక యుద్ధం (1746-48)లో ఫ్రెంచి సైన్యాన్ని సెయింట్ జార్జికోటపైకి నడిపిన అధికారి? 

జ. డూప్లే 

17. కర్ణాటక యుద్ధాలు ఎవరెవరికి మధ్య ప్రధానంగా జరిగాయి? 

జ. బ్రిటిష్ వారికి, ఫ్రెంచివారికి 

18. మొదటి కర్ణాటక యుద్ధంలో విజయం ఎవరిది?

 జ. ఫ్రెంచివారిది 

19. తమ మాతృదేశాల అనుమతి లేకుండానే ఏ యుద్ధంలో ఇంగ్లిష్, ఫ్రెంచివారు తలపడ్డారు? 

జ. రెండో కర్ణాటక యుద్ధం 

20. రెండో కర్ణాటక యుద్ధంనకు ప్రధాన కారణం? 

జ. హైదరాబాద్ రాజ్యం , కర్ణాటక రాజ్య వారసత్వ సంఘర్షణలు

 21. హైదరాబాద్ వారసత్వ సంఘర్షణలో ఫ్రెంచివారు ఎవరికి మద్దతునిచ్చారు? 

జ. ముజఫర్ జంగ్

22. ముజఫర్ జంగ్ ను హైద్రాబాద్ పాలకుడిగా చేసిన ఫ్రెంచి అధికారి ? 

జ. డూప్లే 

23. డూప్లే వల్ల కర్ణాటక సింహాసనాన్ని అధిష్టించినవారు ? 

జ. చందాసాహెబ్

24. కర్ణాటక వారసత్వ సమస్య ఎవరెవరికి మధ్య వచ్చింది ?

 జ. చందాసాహెబ్, అన్వరుద్దీన్

25. రెండో కర్ణాటక యుద్ధంలో (1748-51) ఇంగ్లిష్ వారు ఎవరిని సమర్థించారు ? 

జ. నాసిర్ జంగ్, మహ్మదాలీ 

26. హైదరాబాద్ రాజ్య సింహాసనానికై పోటీపడ్డవారు ? 

జ. నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్ 

27. హైదరాబాద్ నిజాం గోసలాబత్ జంగ్ ను ప్రకటించిన ఫ్రెంచి అధికారి ? 

జ. బుస్సీ 

28. చందాసాహెబును చంపి మహ్మదాలీని కర్ణాటక నవాబుగా ప్రకటించిన ఆంగ్లేయ అధికారి? 

జ. రాబర్ట్ క్లైవ్ 

29. భారతదేశంలో ఫ్రెంచివారు తమ పలుకుబడిని మొట్ట మొదటగా ఏ యుద్ధ ఫలితంగా కోల్పోయారు? 

జ. రెండో కర్ణాటక యుద్ధం 

30. రెండో కర్ణాటక యుద్ధం చివరలో విజయం సాధించిన వారు ? 

జ. ఆంగ్లేయులు 

31. ఉత్తర సర్కార్‌ల్లో ఓ ప్రాంతం తప్ప మిగలిన వాటిని సలాబత్ జంగ్ ఫ్రెంచి వారికి ఇచ్చారు. ఆ ప్రాంతం ఏది?

 జ. గుంటూరు జిల్లా 

32. రెండో కర్ణాటక యుద్ధం తర్వాత ఫ్రెంచివారికి, ఆంగ్లేయులకు మధ్య జరిగిన సంధి?

 జ. పుదుచ్చేరి సంధి 

33. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం?

 జ. 1757

34. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల విజయానికి కారణమైనవాడు ?

 జ. రాబర్ట్ క్లైవ్

 35. మూడో కర్ణాటక యుద్ధం (1758-63)లో ఫ్రెంచి సేనాని ?

 జ. కౌంట్-డీ లాలీ

36. మూడో కర్ణాటక యుద్ధం తర్వాత ఆంగ్లేయులకు లొంగిపోయిన ఫ్రెంచి అధికారి ? 

జ. బుస్సీ

37. మూడో కర్ణాటక యుద్ధం వల్ల అధికంగా నష్టపోయిన వారు?

 జ. ఫ్రెంచివారు 

38. కలకత్తా చీకటి గది ఉదంతానికి కారణమైనవాడు ? 

జ. బెంగాల్ నవాబు సిరాజుధౌలా

39. కలకత్తా చీకటి గది ఉదంతం జరిగిన ప్రదేశం? 

జ. సెయింట్ విలియం కోట

40. బ్రిటీష్ వారి అధికారం భారతదేశంలో స్థాపించేందుకు నాందిపలికిన యుద్ధం? 

జ. ప్లాసీయుద్ధం 

41. ప్లాసీ యుద్ధంలో సిరాజుధౌలాను మోసం చేసి ఆంగ్లేయులకు సహాయపడినవాడు ? 

జ. మీర్ జాఫర్ 

42. మీర్ జాఫర్ ను బెంగాల్ నవాబును చేసి విపరీతమైన ధనం సంపాదించినవాడు ? 

జ. రాబర్ట్ క్లైవ్ 

43. కస్టమ్స్ పన్నును ఎత్తివేసి భారతీయ వర్తకులూ ఇంగ్లీష్ వారితో సమానంగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతిచ్చినవాడు ? 

జ. బెంగాల్ నవాబు మీర్‌ఖాసీమ్ 

44. బక్సార్ యుద్ధం (1764)లో ఓడినవాడు ? 

జ. మొగల్ చక్రవర్తి షా ఆలం, బెంగాల్ నవాబు మీర్ ఖాసిమ్, అయోధ్య నవాబు షుజా-ఉద్దౌలా 

45. బక్సార్ యుద్ధ ఫలితంగా బ్రిటీష్ వారు పొందింది?

 జ. దివానీ అధికారం 

46. దివానీ అధికారం అంటే ? 

జ. బెంగాల్, బీహార్, ఒరిస్సాలనుంచి భూమిశిస్తు వసూలు చేసుకునే అధికారం 

47. బెంగాల్ రాష్ట్ర మొదటి ఆంగ్లేయ గవర్నర్? 

జ. రాబర్ట్ క్లైవ్ 

48. బెంగాల్ లో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి కారణమైన యుద్ధం ? 

జ. బక్సార్ యుద్ధం

49. ద్వంద్వ ప్రభుత్వం అంటే ?

 జ. ఆంగ్లేయులు భూమిశిస్తును, పన్నులను వసూలు చేయడం, బెంగాల్ నవాబు పరిపాలన చేయడం

50. రాబర్ట్ క్లైవ్ భూమిశిస్తు వసూలుకు ఎవరిని ఉద్యోగులుగా నియమించాడు ? 

జ. భారతీయులను

51. మొదటి మైసూరు యుద్ధం(1767-69) ఎవరెవరికి మధ్య జరిగింది? 

జ. హైదరాలీ, ఆంగ్లేయులు

 52. రెండో మైసూరు యుద్ధం(1780-82) ఎవరెవరి మధ్య సంధితో ముగిసింది ?

 జ. టిప్పుసుల్తాన్, ఆంగ్లేయులు 

53. మొదటి మైసూరు యుద్ధం ఎవరి విజయంతో ముగిసింది ?

 జ. హైదరాలీ 

54. రెండో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది? 

జ. మంగళూరు సంధి

55. మంగళూరు సంధి ఏ సంవత్సరంలో జరిగింది ? 

జ. క్రీ.శ. 1782లో 

56. హైదరాలీ ఏ యుద్ధంలో చనిపోయాడు ? 

జ. రెండో మైసూరు యుద్ధం 

57. మూడో మైసూరు యుద్ధం తర్వాత సంధి చేసుకున్నవారు ?

 జ. కారన్‌వాలీస్, టిప్పుసుల్తాన్ 

58. టిప్పు సుల్తాన్ మొదటి సారిగా ఓడిపోయిన యుద్ధం ?

జ. మూడో మైసూరు యుద్ధం 

59. నాలుగో మైసూరు యుద్ధంలో (1799) వెల్లస్లీ చేతిలో ఓడిపోయి చనిపోయినవాడు ? 

జ. టిప్పు సుల్తాన్ 

60. ఇంగ్లిష్ వారు మైసూరు రాజుగా ఎవరిని చేశారు? 

జ. కృష్ణరాజు ఒడయార్ 

61. నానా ఫడ్నవీస్ ఆంగ్లేయులతో చేసుకున్న సంధి? 

జ. సాల్బె సంధి(1776)

62. బెంగాల్ లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసిన వాడు ? 

జ. వారన్ హేస్టింగ్స్ 

63. కలకత్తాను బెంగాల్ రాష్ట్ర రాజధానిగా చేసుకున్నవాడు ? 

జ. వారన్ హేస్టింగ్స్ 

 64. గవర్నర్ జనరల్ గా వారెన్ హేస్టింగ్స్ చేసిన సంస్కరణలు ?

హిందూన్యాయ సూత్రాలను క్రోడీకరించడం 

జిల్లాస్థాయిల్లోనూ కోర్టులు స్థాపించడం

భూమిశిస్తు వసూలు చేసే హక్కును వేలంవేసే పద్ధతి ద్వారా సంస్కరించాడు

 65. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ? 

జ. వారన్ హేస్టింగ్స్ (1793) 

66. గ్రామపంచాయతీ వ్యవస్థను రద్దుచేసిన గవర్నర్ జనరల్ ?

 జ. వారన్ హేస్టింగ్స్ 

67. సైన్యసహకార పద్ధతికి ఆద్యుడు ? 

జ. వెల్లేస్లీ

 68. బ్రిటీష్ వారి సైన్య సహకార పద్ధతికి ముందుగా అంగీకరించిన స్వదేశీ రాజు? 

జ. హైదరాబాద్ నిజాం 

69. ఆంగ్ల విద్యను మన దేశంలో ప్రవేశపెట్టిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ? 

జ. విలియం బెంటింగ్ 

70. సతీసహగమనాన్ని రూపుమాపినవాడు ? 

జ. విలియం బెంటింగ్

11. స్త్రీ విద్యను ప్రోత్సహించిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ?

 జ. డ‌ల్హౌసీ

 12. భారతదేశంలో సివిల్ సర్వీసులను ప్రారంభించినవాడు ?

 జ. కారన్ వాలీస్ 

78. రైత్వారీ పద్ధతిని బ్రిటీష్ వారు ఏయే రాష్ట్రాల్లో అమలు చేశారు ? 

జ. మద్రాసు, బొంబాయి

74. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ల్లో ప్రవేశపెట్టిన భూమిశిస్తు పద్ధతి? 

జ. మహళ్వారీ పద్ధతి 

15. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏయే రాష్ట్రాల్లో అమలు చేశారు ? 

జ. బెంగాల్, బీహార్, ఒరిస్సా 

76. భారతదేశంలో విద్యాభివృద్ధికోసం మొదటిసారిగా కృషిచేసిన చట్టం?

 జ. 1813 చార్టర్ చట్టం

77. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన సంవత్సరం?

 జ. 1835 

78. బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన మొదటి రైల్వేమార్గాన్ని (1853) ఎక్కడ నుంచి ఎక్కడకి వేశారు ? 

జ. ముంబాయి నుంచి థానే కు 

79. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు? 

జ. భిల్లులు(మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్), సంతాలులు(బెంగాల్, బీహార్), కోలులు(బెంగాల్, బీహార్,ఒరిస్సా) 

80. బిల్లుల నాయకుడు? జ. ఊటిరాట్ సింగ్ 

81. వహబీ ఉద్యమం జరిగిన ప్రాంతం? 

జ. బెంగాల్, బీహార్ 

82. భారత ప్రథమ సంగ్రామంగా పేర్కొన్నది ? 

జ. 1857 సిపాయిల తిరుగుబాటు

 88. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ? 

జ. డ‌ల్హౌసీ

 84. మంగల్ పాండే ఏ పదాతి దళానికి చెందిన వాడు ? 

జ. బెర్హంపూర్ 

85. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఏ మొగల్ చక్రవర్తిని భారత చక్రవర్తిగా తిరుగుబాటుదారులు ప్రకటించారు ? 

జ. రెండో బహదూర్‌షా

86. బీహార్ లో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించినవారు ? 

జ. కున్వర్ సింగ్ 

87. నానాసాహెబ్ నాయకత్వం వహించిన తిరుగుబాటు దారులు ఏ ప్రాంతం వారు ?

 జ. కాన్పూరు

 88. నానాసాహెబ్ సైన్యాలకు నాయకత్వం వహించినవారు ? 

జ. తాంతియాతోపే

 89. 1857 తిరుగుబాటుకాలంలో బ్రిటీష్ సైన్యాలకు ఎదురోడి పోరాడిన మహిళ? 

జ. ఝాన్సీ లక్ష్మీబాయి 

90. సిపాయిల తిరుగుబాటు (1857) కాలంలో లక్నో రెసిడెన్సీని ముట్టడించిన సైన్యానికి నాయకుడు ?

 జ. మౌల్వీ అహ్మదుల్లా 

91. బరేలీలోని సైన్యాలకు నాయకత్వం వహించినవాడు ? 

జ. ఖాన్ బహదూర్ ఖాన్

92. మొగల్ చక్రవర్తి రెండో బహదూర్ షా ఎక్కడ మరణించాడు ? 

జ. రంగూన్ (బర్మా) (1862) 

93. బెంగాల్ లో వార్షిక హిందూమేళాను ప్రారంభించినవారు? 

జ. గోపాల్ మిత్రా

94. మహారాష్ట్రలో గణపతి ఉత్సవాన్ని, శివాజీ ఉత్సవాన్ని ప్రారంభించినవారు ? 

జ. తిలక్

 95. చికాగోలో జరిగిన ప్రపంచమతాల పార్లమెంటులో పాల్గొన్న భారతీయుడు ? 

జ. స్వామి వివేకానంద

96. బెంగాల్ (1818)లో సెరామ్ మూర్ కళాశాలను నెలకొల్పినవాడు ? 

జ. విలియమ్ కేరీ

97. 1857 సిపాయిల తిరుగుబాటు ఏ తేదీన ప్రారంభమైంది ? 

జ. మే, 10

98. 1857 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? 

జ. మీరట్

99. భారతదేశంలో బ్రిటీష్ కంపెనీ పాలన ఏ చట్టంతో రద్దయింది? 

జ. 1858 చట్టం 

100. 1858 చట్టం తర్వాత భారతదేశంలోని బ్రిటీష్ ప్రభుత్వాధిపతిని ఎలా పిలిచారు ? 

జ. వైస్రాయ్

101. ఇండియా, ఇంగ్లండ్ మధ్య మొదటి టెలిగ్రాఫ్ లైను ఏ సంవత్సరంలో వేశారు ?

 జ. 1870

102. విక్టోరియా మహారాణి పంపిన ప్రకటనను 1858లో లార్డ్ కానింగ్ ఎక్కడ చదివి వినిపించాడు ?

 జ. అలహాబాద్

103. ఇండియా, ఇంగ్లండ్ ల  మధ్య దూరాన్ని తగ్గించిన సూయజ్ కాలువను ఎప్పుడు తెరిచారు ?

 జ. 1869

104. భారతదేశంలో తొలిసారిగా ఏ సంవత్సరంలో బడ్జెట్ తయారయింది ? 

జ. 1860

105. మనదేశంలో మొదటిసారిగా ఆదాయపన్నును ఏ సంవత్సరం నుంచి వసూలు చేస్తున్నారు ? 

జ. 1860

106. భారతదేశంలో మొత్తం ఎన్ని స్వదేశీ సంస్థానాలుండేవి ? 

జ. 562

107. విక్టోరియా మహారాణి భారతదేశ చక్రవర్తిణిగా ఏ రోజు నుంచి ప్రకటించుకొంది ? 

జ. జనవరి 1, 1877

108. స్వదేశీ రాజుల విదేశీ వ్యాపారాన్ని నిషేధించిన బ్రిటీష్ వైస్రాయ్ ? 

జ. కర్జన్ 

109. మొదటి ఆంగ్లో- అప్లాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 

జ. 1839

110. మొదటి ఆంగ్లో-అప్లాన్ యుద్ధం జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ను పాలిస్తున్నవాడు ? 

జ. దోస్త్ మహ్మద్

111. బర్మా స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం? 

జ. 1948 

112. ఇంపీరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అనే సంస్థను ఎక్కడ స్థాపించారు ? 

జ. పూసా (బీహార్) 

113. కరువుపీడిత ప్రాంతాలకు సహాయం అందించాలని బ్రిటీష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో నిశ్చయించింది? 

జ. 1883

114. బెంగాల్ లో చాలా తీవ్రమైన కరువు ఏ సంవత్సరంలో వచ్చింది?

 జ. 1943లో

115. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ను నూతనంగా ఏర్పాటుచేసిన బ్రిటిష్ అధికారి ? 

జ. డ‌ల్హౌసీ

 116. కాలువల తవ్వకాలను ఎక్కువగా చేపట్టిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ? 

జ. రిప్పన్ 

117. 1940లో ఎంత శాతం వ్యవసాయభూమికి నీటి పారుదల సౌకర్యాలు కల్పించబడ్డాయి? 

జ. 13 శాతం 

118. రైల్వేలను అభివృద్ధి చేసిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ? 

జ. డ‌ల్హౌసీ

 119. మొదటి నూలు మిల్లు 1853లో ఎక్కడ నెలకొల్పారు ? 

జ. బొంబాయి

120. 1905లో జమ్ షెడ్ పూర్ లో స్థాపించబడిన ఉక్కు కర్మాగారం ? 

జ. ది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ 

121. బ్రహ్మ సభను (1828) స్థాపించినవారు ? 

జ. రాజారామ్మోహన్ రాయ్

122. ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి, సతీసహగమనమనే సాంఘిక దురాచారాన్ని నిషేధించడానికి కృషి చేసిన వారు? 

జ. రాజారామ్మోహన్ రాయ్

123.రామ్మోహన్ రాయ్ మరణం తర్వాత బ్రహ్మసమాజం వ్యాప్తికి కృషిచేసిన వారు ? 

జ. కేశవచంద్రసేన్, దేవేంద్రనాథ్ టాగూర్

124. ఆర్యసమాజ(1875) స్థాపకుడు ?

 జ. దయానంద సరస్వతి

125. దయానంద సరస్వతి రచించిన గ్రంథాలు ?

 జ. సత్యార్థ ప్రకాశిక, రుగ్వేద భాష్య భూమిక 

126. రామకృష్ణ మిషన్‌ను స్థాపించినవారు ? 

జ. స్వామి వివేకానంద

No comments:

Post a Comment